మాటే మంత్రం

>> Tuesday, March 18, 2008

ఈ ప్రపంచంలో అన్నిటి కన్నా శక్తివంతమైనది ఏదైనా ఉన్నది అంటే అది మాటేనన్నది ఎంతో మంది కాదనలేని సత్యం.ఒకే ఒక్క మాట సహాయంతో మహా మహా కార్యాలే సాధించవచ్చు. అంతెందుకు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు ఓడి పాండవులు గెలవడానికి కారణం కృష్ణుని మాట సహాయమే కదా. ఒకరోజు కౌరవపక్షాన ధుర్యోధనుడు, పాండవ పక్షాన అర్జునుడు యుద్దంలో సాయమాశించి కృష్ణుని వద్దకు వెళ్ళారు. ఇద్దరూ ఒకేసారి వెళ్ళారు. పాపం అప్పుడు ఆ పరంధాముడైనా ఏమి చేస్తాడు? అందుకే తన పరివారమంతా ఒక వైపు, తను ఒక్కడే ఒక వైపు అని షరతు పెట్టాడు. అదీ కూడా తన పరివారమంతా యుద్దం చేస్తుందంట తను మాత్రం కేవలం మాట సాయమే చేస్తాడట. వెంటనే ధుర్యోధనుడు యుద్దం చేయని కృష్ణుడెందుకు పరివారమే కావాలి అని కోరుకున్నాడు. అర్జునుడు తెలివిగా కృష్ణుడినే కోరుకున్నాడు. అంతటి వీరాధివీరుడు, తెలివైన వాడు ఐన అర్జునుడు కూడా కదన రంగంలో బంధువులను చూసి పిరికితనంతో యుద్దం చేయనన్నాడు. మాట సహాయం చేస్తానన్న కృష్ణుని వంతు వచ్చింది మాట సహాయం చేయడానికి. వెంటనే ’భగవద్గీత’ బోధించాడు అర్జునుడికి.
అసలు మాటంటే ఏమిటి? కేవలం కొన్ని అక్షరాల సముదాయమా? కాదు కానే కాదు.మాటంటే నొప్పించనిది, మేలుచేసేది, ఇష్టమైనది అయి ఉండాలి. అప్పుడే అది నిలబడుతుంది కలకాలమూ.
అందుకే ఓ కవి అన్నాడు మాటే మంత్రం అని. అది నిజమేగా మరి.

0 comments:

Back to TOP